10 April, 2026 | 3:01 PM

Breaking News

అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •   తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త   •   సిఎం సహాయ నిధి పేదలకు వరం   •   ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం— పాల్గొన్న మంత్రి పొంగులేటి   •   గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి...   •  

తనిఖీల ముసుగులో కానిస్టేబుళ్ల చేతివాటం

13-05-2024 02:32 AM

పట్టుబడిన నగదును కాజేసిన వైనం

ఇద్దరిని సస్పెండ్ చేసిన రాచకొండ సీపీ

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (విజయక్రాంతి): వాహన తనిఖీల ముసుగులో ఇద్దరు కానిస్టేబుళ్లు చేతివాటం ప్రదర్శించారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఓ బైక్‌పై అక్రమంగా తరలిస్తున్న రూ.25 లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్న కానిస్టేబుళ్లు.. ఆ డబ్బును ఎన్నికల అధికారులకు అప్పగించలేదు. దీంతో డబ్బులు తరలిస్తున్న యువకులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కానిస్టే బుళ్ల బండారం వెలుగులోకి వచ్చిం ది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టి చేతివాటం నిజమేనని తేల్చా రు.

ఇద్దరు కానిస్టేబుళ్లను రాచకొండ  సీపీ తరుణ్ జోషి ఆదివారం సాయంత్రం సస్పెండ్ చేశారు. అయి తే వాహనదారుల వద్ద పట్టుబడిన నగదు రూ.50 లక్షలని తొలుత ప్రచారం జరిగింది. అనంతరం రూ.25 లక్షలు అంటూ ప్రచారం జరిగింది. కానీ సాయికుమార్, కార్తీ క్ అనే ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్న రూ.18 లక్షలను స్వాధీ నం చేసుకున్నట్లు కీసర సీఐ ప్రకటించారు. అయితే కానిస్టేబుళ్ల వద్ద నుంచి ఎంత రికవరీ చేశారు, మొ త్తం పట్టుబడిన నగదు ఎంత అనే అంశాలపై పోలీసులు స్పష్టత ఇవ్వ డం లేదు.

రూ. కోటి పట్టుకున్నారని వదంతులు..

ఆదివారం ఉప్పల్ సమీపంలోని కీసర వద్ద హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రూ. కోటి నగదు తరలిస్తున్న రెండు వాహనాలను  టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారని ఓ మీడియా సంస్థకు చెందిన వ్యక్తి వదంతులు సృష్టించారు. అయితే అలాంటిదేమీ లేదని పోలీసులు ధృవీకరించారు.