24-06-2025 05:39:33 PM
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి..
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం..
ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి..
వలిగొండ (విజయక్రాంతి): ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందించడంతో రైతుల కండల్లో ఆనందం వెల్లువిరిసిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbam Anil Kumar Reddy) అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని రైతులందరికీ సాగు యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా అందించడంతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాలతో రైతు భరోసా సంబరాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మంది రైతులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలను, తొమ్మిది రోజులలో జమ చేయడం జరిగిందని అన్నారు. గత పాలకుల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్న రైతుల కోసం రైతు భరోసాను అందించడం జరిగిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు, పేద ప్రజల పక్షపాతి అని రాష్ట్ర ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రాష్ట్రంలో రైతుల కోసం రైతు భరోసా, రైతు రుణమాఫీ కార్యక్రమాలను ప్రజల కోసం సన్న బియ్యం, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లను అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, కంకల కిష్టయ్య, బత్తిని లింగయ్య, బత్తిని సహదేవ్, కుంభం వెంకట్ పాపిరెడ్డి, పబ్బు ఉపేందర్ బోస్, గరిసే రవి, తుమ్మల యుగంధర్ రెడ్డి, పల్సం సతీష్, గూడూరు శివశంత్ రెడ్డి, చెరుకు శివయ్య గౌడ్, జక్క జంగారెడ్డి, మామిడి నరేందర్ రెడ్డి, కొండూరు భాస్కర్, కాసుల వెంకటేశం, కొండూరు సాయి, బత్తిని వరుణ్ తదితరులు పాల్గొన్నారు.