calender_icon.png 30 June, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు: స్పందించిన హరీష్ రావు

30-06-2025 12:21:14 PM

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో(Pashamylaram Industrial Area) భారీ అగ్ని ప్రమాదం జరిగి కార్మికులు అందులో చిక్కుకోవడం అత్యంత విషాదకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Siddipet MLA Tanniru Harish Rao) అన్నారు. కార్మికులు, సిబ్బందిని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు వెంటనే చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని కోరారు. 

టాన్‌చెరు మండలం పాశమైలారంలోని సీగాచి కెమికల్స్‌ పరిశ్రమలో(Sigachi Chemicals Industry) రియాక్టర్‌ పేలిన దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. 20 మందికిపైగా కార్మికులకు తీవ్రగాయాలైనట్లు సమాచారం. కంపెనీలో ఇంకా భారీగా మంటలు ఎగిసిపడుతున్నాాయి. ప్రస్తుతం సంఘటనాస్థలంలో అగ్నిమాపస సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు శ్రమిస్తున్నారు. కెమికల్‌ఫ్యాక్టరీలో మంటల వల్ల ఘాటైన వాసనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.