ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): రైతు రుణమాఫీపై సవాలు చేసిన మాజీమంత్రి హరీశ్రావు తన రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ ము న్సిపాలిటీ పరిధిలోని ఇస్లాం నగర్లో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతుందని, హరీశ్రావు రాజీనామా మాటకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. బీజేపీ నాయ కులు మతం పేరిట రాజకీయం చేస్తున్నారని, ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తా రని పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్కు దక్కుతున్న ఆదరణను చూసి ఓర్వలేకపోతున్న ప్రధాని మోదీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల తప్పుడు ప్రచారాలను ప్రజలు గమనించాలని, పేదల సంక్షేమానికి కృషి చేసే కాంగ్రెస్కు ఓటు వేయాలని కోరారు.