18 April, 2026 | 11:46 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

హెచ్‌డీసీసీబీ పాలకవర్గ సమావేశం

10-05-2025 12:16 AM

-పలు అంశాలపై తీర్మానం  

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): నాంపల్లిలోని హైదరాబాద్ సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అధ్యక్షతన పాలకవర్గ సమావేశం నిర్వహించి, పలు బ్యాంక్ అంశాలపై తీర్మానం చేశారు.

తీర్మానించిన అంశాలలో డీసీసీబీ నుంచి పీఏసీఎస్‌లకు గోల్‌డలోన్ (క్యాష్ ట్రేడ్స్) కింద వడ్డీరేటు 10.5శాతనం నుంచి 9.5శాతానికి తగ్గించడం ద్వారా రైతులకు మేలు కలుగుతుందని కుర్మ సత్తయ్య పేర్కొన్నరు. నూతన డీసీసీబీ భవన నిర్మాణం, ప్రతిపాదనకై ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ కమిటీని ఏర్పాటు చేశారు.

బ్యాంకింగ్, లావాదేవీలపై రిస్క్ మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఇతర అంశాలపై చర్చించారు. సమావేశంలో డైరెక్టర్లు అంజిరెడ్డి, చంద్రశేఖర్, బాల్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, కిషన్ నాయక్, లక్ష్మారెడ్డి, పోలీస్ రాంరెడ్డి, బూరుకుంట సతీష్, ఆనంద్, శ్యామ్‌సుందర్‌రెడ్డి, మొగులయ్య, మోహన్‌రావు, పీజీవీ రాణి, గుగులోతు సైదా, బ్యాంక్ సీఈవో భాస్కర సుబ్రహ్మణ్యం, జీఎం ప్రభాకర్‌రెడ్డి, డీజీఎం కిరణ్, ఏజీఎం రమాదేవి, ప్రొఫషనల్ డైరెక్టర్ గిరిధర్ పాల్గొన్నారు.