17 April, 2026 | 11:50 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

స్పా సెంటర్‌పై పోలీసుల దాడి.. ఏడుగురు మహిళలు సేఫ్

11-05-2025 12:30 PM

హైదరాబాద్: మేడిపల్లి పోలీసులు, రాచకొండ పోలీసుల ఏహెచ్‌టీయూ(Anti-Human Trafficking Unit) యూనిట్ తో కలిసి చెంగిచెర్ల వద్ద ఉన్న ఒక స్పా సెంటర్ పై దాడి చేసి, ఒక నిర్వాహకుడు, ఒక కస్టమర్ ను పట్టుకుని వ్యభిచారంలోకి దింపబడుతున్న ఏడుగురు మహిళలను రక్షించారు. విశ్వసనీయ సమాచారం మేరకు మేడిపల్లి పోలీసులు(Medipalli Police), ఏహెచ్‌టీయూ యూనిట్ సంయుక్త బృందం చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో ఉన్న షుగర్ స్పా సెంటర్ పై దాడి చేసి, అంబర్ పేట్ కు చెందిన పల్లవి అనే నిర్వాహకురాలిని పట్టుకున్నారు. పోలీసుల ప్రకారం.. పల్లవి మసాజ్ పార్లర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తూ, కస్టమర్లను ఆకర్షించింది. ఆమె కస్టమర్ల నుండి భారీగా వసూలు చేసి, బలవంతంగా వ్యభిచారంలోకి దింపబడిన మహిళలకు చిన్న మొత్తాలు చెల్లించిందని పోలీసులు తెలిపారు. రక్షించబడిన మహిళలను షెల్టర్ హోమ్ కు తరలించారు. నిర్వాహకురాలు పల్లవి, ఒక కస్టమర్ ను జైలుకు పంపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.