23-06-2025 12:23:04 AM
చేవెళ్ల, జూన్ 22: భూములు చదును చేస్తానని చెప్పి.. మట్టిని అమ్ముకున్నాడో మాజీ సర్పంచ్. దీంతో ఆదివారం బాధితులు ధర్నాకు దిగారు. వారి వివరాల ప్రకారం.. రంగారెడ్డి జి ల్లా షాబాద్ మండలం పెద్దవీడు రెవెన్యూ గ్రామంలో సర్వేనెంబర్లు 90 , 147లో 30 మంది ద ళిత రైతులకు చెందిన 100 ఎకరాల భూములు ఉన్నాయి. అయితే అవి కొంచె ఎత్తు పల్లాలుగా ఉండడాన్ని ఆసరాగా తీసుకున్న మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ భూములను లెవల్ చేస్తానని, ఇలా చేయగా వచ్చే మట్టిని ఇండస్ట్రియల్ కంపెనీకి తరలిస్తానని నమ్మించాడు.
డబ్బులు కూడా ఇస్తానని హామీ ఇవ్వడంతో నమ్మిన రైతులు ఇందుకు అంగీకరించారు. కానీ, లెవల్ కాదుకగా... ఏకంగా గుంతలు కొట్టి మరీ మట్టిని అమ్ముకున్నాడు. కానీ, ఏండ్లు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు ఆదివారం ఆయన ఇంటి ముందు టెంట్ వేసి ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, వారు తమకు న్యాయం జరిగే వరకు ధర్నా విరమించేది లేదని తేల్చిచెప్పారు.