20-12-2025 12:47:30 AM
అయిజ, డిసెంబర్ 19: జోగులాంబ గద్వాల జిల్లా ఐజలో హార్ట్ ఫుల్ నెస్ అని మెడిటేషన్ గోడపత్రికలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షావలి ప్రారంభించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో ఉరుకులు పరుగులతో కాలo నడుస్తుందని ఇటువంటి సమయంలో ప్రతి వ్యక్తి మానసిక ఒత్తిడికి లోనై గుండె జబ్బులు, క్యాన్సర్ మరియు భయంకరమైన రోగాల బారిన పడి చనిపోతున్నారన్నారు .
కావున ప్రతి వ్యక్తి రోజు ఒక గంట సేపు మెడిటేషన్ చేయాలనీ మానసిక రుగ్మతల నుండి బయటపడి ఆరోగ్యంగా జీవించే ఆస్కారం ఉందన్నారు . ఈ నెల 21వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఆన్లైన్ మెడిటేషన్ లో పాల్గొని ఆరోగ్యాన్ని సుఖవంతంగా చేసుకోవాలన్నారు . ఈ కార్యక్రమంలో హార్ట్ ఫుల్ నెస్ సంస్థ మెంబెర్ రాజేష్ మరియు వీరన్న, సురేష్, మహేంద్ర, వీరేష్, అమర్,భాస్కర్ పాల్గొన్నారు.