13 May, 2026 | 11:42 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

01-09-2025 06:31 PM

హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(IMD) ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో రాబోయే 12 నుంచి 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని కారణంగా, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు, హైదరాబాద్ దాని పొరుగు జిల్లాలైన మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, యాదాద్రి భువనగిరిలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేయగా, తూర్పు, ఉత్తర ప్రాంతాలలోని జిల్లాల్లో 115.6 మిమీ నుండి 204.4 మిమీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.