బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(IMD) ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో రాబోయే 12 నుంచి 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని కారణంగా, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు, హైదరాబాద్ దాని పొరుగు జిల్లాలైన మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, యాదాద్రి భువనగిరిలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేయగా, తూర్పు, ఉత్తర ప్రాంతాలలోని జిల్లాల్లో 115.6 మిమీ నుండి 204.4 మిమీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.






