03-07-2025 07:46:25 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) హజారియా తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 25 మంది విద్యార్థులకు దాత మామిడాల సత్యనారాయణ 5 వేల రూపాయలతో షూస్ సమకూర్చారు. గురువారం పాఠశాలలో విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దాత సత్యనారాయణ, రిటైర్డ్ హెడ్మాస్టర్ మైస శ్రీనివాసు, విశ్వేశ్వర ట్రస్ట్ చైర్మన్ జానీ తదితరులు పాల్గొన్నారు.