17 April, 2026 | 11:50 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

మానవత్వం పరిమళించిన వేళ

26-06-2025 02:07 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): ఎవరికైనా కష్టం వస్తే మాకు ఏంటి అని వదిలి వెళ్లే ఈ కాలంలో కొందరు యువకులు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఎవరు పట్టించుకోని స్థితిలో రోడ్డు పక్కన పడి ఉన్న వ్యక్తిని ఆదరించి, అంబులెన్స్ లో ఎక్కించి, ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చిన వైనం ఇది. గురువారం రాత్రి జాములో ఖానాపూర్ మండలం(Khanapur Mandal) మస్కాపూర్ అర్బన్ పార్క్ వద్ద గుర్తు తెలియని వాహనం ఒక వ్రద్ధుడిని ఢీ కొట్టి వెళ్లిపోగా, అప్పటినుంచి రోడ్డు పక్కన పడి ఉన్న అతనిని ఎవరు ఆదరించలేని పరిస్థితిలో పడి ఉన్న అతనిని గమనించిన స్థానిక ఎంఐఎం పార్టీ అధ్యక్షులు అఖిల్, జనరల్ సెక్రటరీ అప్సర్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు బాబర్ లు  స్పందించి, 108 అంబులెన్స్ ను పిలిపించి, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐకి సమాచారం అందించినట్లు వారు తెలిపారు.