11-08-2025 12:07:28 AM
మంగపేట, ఆగస్టు 10 (విజయ క్రాంతి ): ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులో స్వయంభుగా వెలసిన మహా పుణ్య క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో రెండో యాదాద్రిగా పేరుగాంచిన శ్రీ హేమచల లక్ష్మి నృసింహ స్వామి ఆదిలక్ష్మి చెంచులక్ష్మి దైత అమ్మవార్లను దర్శించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలలోని భక్తులు ఆదివారం సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి చింతామణి జలపాతం (అక్కథార, చెల్లెధార) లో స్నానం ఆచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ ప్రాంగణం స్వామివారి నామ స్మరణతో మార్మోగింది.