24 June, 2026 | 2:35 PM

Breaking News

రాష్ట్రవ్యాప్తంగా వినిపించే ఒకే మాట.. 'కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ కావాలి'   •   'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •  

భూ యాజమాన్య వివాదం.. పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు

13-12-2025 10:04 AM

హైదరాబాద్: వివాదాస్పద భూముల యాజమాన్యాన్ని నిర్ధారించే అధికారం పోలీసులకు ఎక్కడిదని తెలంగాణ హైకోర్టు శుక్రవారం ప్రశ్నించింది. ఇటువంటి విషయాలు సివిల్ పరిధిలోకి వస్తాయని, పోలీసుల అధికార పరిధిలోకి రావని హైకోర్టు పేర్కొంది. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, షమీర్‌పేట్ మండలం, తుంకుంటకు చెందిన మెండు అనిల్ కుమార్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై  జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ విచారించారు. 

పిటిషనర్ తాను పౌర వివాదంగా అభివర్ణించిన విషయంలో షామీర్‌పేట్ ఎస్హెచ్‌ఓ, సబ్-ఇన్‌స్పెక్టర్ల జోక్యాన్ని సవాలు చేశారు. పిటిషనర్ తరఫున హాజరైన న్యాయవాది ఎస్. శ్రీధర్ వాదిస్తూ, అనిల్ కుమార్ మార్చి 2018లో తుంకుంటలో 133 చదరపు గజాల ప్లాటును కొనుగోలు చేశారని తెలిపారు. అతను ఆ స్థలంలో ప్రహరీ గోడ, ఒక చిన్న గదిని నిర్మించి, విద్యుత్ కనెక్షన్ పొందారు. వినియోగ ఛార్జీలు, ఆస్తి పన్నులను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారని ఆయన కోర్టుకు సమర్పించారు.

అయితే, స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తి ఎం.వెంకట రెడ్డి, ఆ ఆస్తిపై తన హక్కును చూపిస్తూ దానిని అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసినప్పటికీ, షామీర్‌పేట పోలీసులు 2023 నాటి నోటరైజ్డ్ ఒప్పందం ఆధారంగా ఆ ఆస్తి వెంకట రెడ్డికి చెందినదని నిర్ధారించి, పిటిషనర్ ఫిర్యాదుపై చర్య తీసుకోవడంలో విఫలమయ్యారని శ్రీధర్ వాదించారు.

పౌర విషయాలలో యాజమాన్యాన్ని నిర్ణయించే అధికారం పోలీసులకు లేదని ఆయన వాదించారు. రెండు వైపుల వాదనలు విన్న జస్టిస్ శ్రవణ్ కుమార్ సమర్పించిన పత్రాలను పరిశీలించి పోలీసులు భూమి యాజమాన్యాన్ని ఎలా నిర్ణయించగలరని ప్రశ్నించారు. అనంతరం వివరణాత్మక కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ఈ విషయమై వివరణ కోరుతూ న్యాయస్థానం హోంశాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, షమీర్‌పేట్ ఎస్హెచ్‌ఓ, దర్యాప్తు సబ్-ఇన్‌స్పెక్టర్లు మరియు వెంకట రెడ్డికి నోటీసులు జారీ చేసింది.