కాలానికి అనుగుణంగా మారడానికి సిద్ధం
హైదరాబాద్: భారత వైమానిక దళంలోని వివిధ శాఖలకు చెందిన ఫ్లైట్ క్యాడెట్ల ప్రీ-కమిషనింగ్ శిక్షణ విజయవంతంగా పూర్తయినందుకు గుర్తుగా హైదరాబాద్లోని దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన 216 కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (CGP)లో జనరల్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనరల్ చౌహాన్ మాట్లాడుతూ... యుద్ధం, యుద్ధతంత్రం ఒక పెద్ద విప్లవపు అంచున ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ శనివారం పేర్కొన్నారు.
భారత రక్షణ దళాలు మారుతున్న కాలానికి అనుగుణంగా మారడానికి సిద్ధంగా, సమర్థవంతంగా ఉండేందుకు సంస్కరణలను స్వీకరించడానికి కట్టుబడి ఉన్నాయన్నారు. మాటలతో యుద్ధాలు గెలవలేమని పాకిస్థాన్ ను ఉద్దేశించి చురకలంటించారు. భారతదేశం బలం బలమైన సంస్థలు, ప్రజాస్వామ్య స్థిరత్వం, మన సాయుధ దళాల అచంచలమైన వృత్తి నైపుణ్యంపై ఆధారపడి ఉందని తెలిపారు. ఆపరేషన్ల తీవ్రత తగ్గి ఉండవచ్చని, కానీ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని ఆయన అన్నారు.






