calender_icon.png 30 June, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసేపట్లో నిన్ను చంపేస్తాం

30-06-2025 12:41:21 AM

ఎంపీ రఘునందన్‌కు మావోయిస్టుల పేరుతో మళ్లీ బెదిరింపులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 29 (విజయక్రాంతి): మెదక్ ఎంపీ రఘునందన్‌రావుకు మరోసారి బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో ఆదివారం తన కాలికి సర్జరీ చేయించుకొని చికిత్స పొందుతుండగా ఈ ఫోన్ కాల్ వచ్చింది. మరికాసే పట్లో నిన్ను చంపేస్తామని.. ఆపరేషన్ కగార్ ఆపాలని ఆగంతకులు బెదిరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, జూన్ 23న రఘునందన్ రావుకు మొదటి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.

ఒక వ్యక్తి ఫోన్ చేసి నేను మావోయిస్టును.. మధ్యప్రదేశ్ నుంచి కాల్ చేస్తున్నా.. సాయంత్రంలోగా నిన్ను లేపేస్తాం.. దమ్ముంటే కాపాడుకోండి’ అని బెదిరించాడు. ‘మావోయిస్టులు మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరారు. రాత్రి 12 గంట ల వరకు సార్ ఎక్కడ ఉంటే అక్కడికి చేరుకుంటారు.. అని తిరిగి బెదిరించినట్లు తెలిపారు. కాల్ గురించి రఘు నందన్‌రావు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డీజీపీతో పాటు సంగారెడ్డి, మెదక్ ఎస్పీలకు రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు.