1 April, 2026 | 12:03 PM

Breaking News

దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితులకు మరోసారి కస్టడీ   •  

ఆక్రమణలపై హెచ్ఎండీఏ ఉక్కుపాదం

07-12-2024 04:57 PM

శంషాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత 

రాజేంద్రనగర్: హెచ్ఎండిఏ అధికారులు అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపారు. శంషాబాద్ పట్టణంలో హెచ్ఎండిఏ స్థలాల్లో అక్రమంగా వెలిసిన కట్టడాలను భారీ పోలీసు బందోబస్తు నడుమ నేలమట్టం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్ పోర్టు ర్యాంపు పక్కనే హెచ్ఎండీఏ భూములు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంతకాలంగా కొందరు అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఈ మేరకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో శనివారం హెచ్ఎండీఏ అడిషనల్ కలెక్టర్ షర్మిల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. ఎయిర్ పోర్ట్ ఫ్లైఓవర్ నిర్మించే సమయంలో ర్యాంపు చుట్టూ ఉన్న భూములను హెచ్ఎండీఏ అప్పట్లోనే స్వాధీనం చేసుకుందన్నారు. అయితే కొందరు అక్రమార్కులు ఆ భూముల్లో షెడ్లు నిర్మించారు. దీంతో కూల్చివేతలు చేపట్టినట్లు ఆమె వివరించారు. నిబంధనలు ఉల్లంఘించి మరో మారు నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు.