17 April, 2026 | 3:45 PM

Breaking News

కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. మహిళా మృతి   •   దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర... కొత్తగా మహిళా బిల్లు అవసరం లేదు   •   బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి   •   జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి   •   ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •  

పదో తరగతి రాష్ట్ర టాపర్‌కు సన్మానం

05-05-2025 02:39 AM

నిజామాబాద్, మే 4(విజయ క్రాంతి): ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయలో 596 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకులో నిలిచిన కాకతీయ ఒలంపియాడ్ విద్యార్థిని  ఎస్. కృతి నీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దంపాల్ సూర్యనారాయణ సన్మానిం చారు.

ఈ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగింది ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా విద్యార్థిని రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించడం పాఠశాల తల్లిదండ్రులకు జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిందని కొనియాడారు భవిష్యత్తులో ఇంకా ఉన్నత లక్ష్యాలను సాధించే హిందువులు జిల్లాకు గర్వకారణంగా విద్యార్థులు నిలవాలని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు.

తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు తక్కువ మార్కులు సాధించి ఫెయిల్ అయినప్పటికీని విద్యార్థులు మనోధైర్యం కోల్పోకుండా చదివి తిరిగి పరీక్ష రాసి ఉత్తీర్ణత పొందాలని అందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సహకరించాలని ఆయన సూచించారు ధన్పాల్ సూర్యనారాయణ లక్ష్మీబాయి విట్టల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా విద్య అందిస్తున్న వారికి ఈ సంవత్సరం పదో తరగతి మొదటి శ్రేణిలో పాసైన విద్యార్థులు ఉండటం సంతోషంగా ఉందన్నారు పేద విద్యార్థుల చదువులకు ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాకతీయ ఒలంపాడ్ స్కూల్ డైరెక్టర్ సిహెచ్ రామోజీరావు కాకతీయ విద్యాసంస్థల ప్రిన్సిపల్ రణదీప్ డాక్టర్ రాఘవేంద్ర చిత్రవారి తదితరులు పాల్గొన్నారు .