16 April, 2026 | 12:06 PM

Breaking News

వీధి కుక్కల దాడి.. మృత్యువుతో పోరాడి— 15 రోజుల తర్వాత బాలుడు మృతి   •   కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •  

భార్య వదిలేసి వెళ్లిందని, ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

05-05-2025 01:35 PM

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా(Sangareddy district) కొండాపూర్ మండలం మల్కపూర్ గ్రామంలో సోమవారం దారణం చోటుచేసుకుంది. భార్య తనను వదిలేసి వెళ్లిందనే మనస్తాపంతో ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను ఉరి వేసుకుని చంపాడు. ఆ తర్వాత, ఆ వ్యక్తి కూడా మల్కాపూర్ గ్రామంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వృత్తిరీత్యా ఆర్‌ఎంపీ డాక్టర్ అయిన సుభాష్ (42) గా, అతని పిల్లలు మారిన్ (13), ఆరాధ్య (10) గా గుర్తించారు. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని సుభాష్ మనస్తాపానికి లోనయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.