ఆర్మీ జవాన్లకు సన్మానం
గాంధారి, జూన్ 3 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారం తండాలో గల శ్రీశ్రీశ్రీ కోదండ రామాలయం లో నూతనంగా ఆర్మీ జవాన్లు గా ఎంపికైన 25 మంది యువకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తండా పెద్ద బిషన్ నాయక్ మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల యువకులు భారత ఆర్మీకి ఎంపికవ్వడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన యువకులకు పలు సూచనలు చేశారు.
దేశరక్షణకై మండల యువత ముందుడడం మండలానికే గర్వకారణం అని ఆయన అన్నారు. మండల విద్యాధికారి శ్రీహరి మాట్లాడుతూ నేటి యువతకు ఈ 25 మంది ఆదర్శం అని, గ్రామీణ ప్రాంతాల యువకులు, విద్యార్థులు వీరిని మార్గదర్శకంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లభాన సంఘం అధ్యక్షుడు తాన్ సింగ్, మాజీ జడ్పీటీసీ శంకర్ నాయక్, ఉప సర్పంచ్ గోపాల్, బస్సీ నర్సింగ్, పెంటయ్య, పరశురామ్ మహారాజ్ పాల్గొన్నారు..






