15 April, 2026 | 12:21 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వైద్య విద్యార్థులకు సన్మానం

19-10-2025 05:48 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉత్తమ ర్యాంకులతో సీట్లు సాధించిన ఇద్దరు అమ్మాయిలకు దామెర సాహితీ క్షేత్రం నిర్మల్ నర్సింగ్ హోమ్ లో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో నర్సింగ్ హోమ్ సిబ్బంది, మిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. దామెర శోభారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సభలో డాక్టర్ దామెర రాములు ప్రసంగిస్తూ ముందు ముందు మీరు ఇలాగే పీజీ సీట్లు కూడా సంపాదించి మన జిల్లాకు వన్నె తెచ్చి అశేష రోగులకు సేవలందించాలి అప్పుడే మీరు మీ తల్లిదండ్రుల రుణము జిల్లా రుణం తీర్చుకున్నట్లు అవుతుంది. పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాలతో సన్మానం చేయడం జరిగింది, ఈ సందర్భంగా వైద్య విద్యార్థులకు కూడా స్పందించారు. మేము ఉత్తమ ప్రతిభ కనబరిచి చదువుకుంటామని  హామీ ఇచ్చారు.