04-09-2025 12:07:29 AM
పది వేల రూపాయల జరిమానా
ముస్తాబాద్ ఎస్ఐగణేష్
ముస్తాబాద్, సెప్టెంబర్ 03( విజయ క్రాంతి): భార్యను వేధించిన భర్తకు మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల మొదటి ప్రథమ శ్రేణి న్యా యమూర్తి ప్రవీణ్ బుధవారం తీర్పు వెల్లడించినట్లు ముస్తాబాద్ ఎస్.ఐ గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ& రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన సదిమెల రామచంద్రం తన భార్య కనకవ్వను తరచూ మానసికం గా,శారీరకంగా వేధించేవాడని,మద్యం సేవించి గొడవలు పెట్టడంతో పాటు 2016 డిసెంబర్ 2న ఉదయం 6 గంటల సమయంలో భార్యను దారుణంగా కొట్టాడని,టార్చ్లైట్తో దాడి చేసి గా యాలు చేశాడని తెలిపారు.
వేధింపులు భరించలేక బాధితురాలు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా,పోలీసులు నిందితుడు సడిమెల రామచంద్రం పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి నట్లు పేర్కొన్నారు.అనంతరం అప్పటి ఎస్.ఐ లు చిట్టిబాబు,ప్రవీణ్ చార్జ్షీట్ దాఖలు చేశారని తెలిపారు.
ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ వాదించగా,ఎస్.ఐ గణేష్, సీఎంస్ ఎస్.ఐ శ్రవణ్, కోర్టు కానిస్టేబుల్ దేవేందర్ తో పాటు 12 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.నిందితుడు రామచంద్రం పై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి ప్రవీణ్ మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.పది వేలు జరిమానా విధించినట్లు ఎస్.ఐ గణేష్ తెలిపారు.