calender_icon.png 14 November, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడులకు హైదరాబాద్ ముఖద్వారం

14-11-2025 01:05:58 AM

-అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రాధాన్యం

-హైదరాబాద్‌లో రోడ్లకు ప్రముఖ కంపెనీల పేర్లు 

-యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ వార్షిక సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి

-సీఎం విజన్‌పై ప్రశంసలు కురిపించిన టెక్ దిగ్గజాలు

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి) : ప్రపంచవ్యాప్త పెట్టుబడి దారులకు హైదరాబాద్ ఉత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయస్థాయి మౌలి క వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు భరోసానిస్తూ.. భౌగోళికంగా కేంద్ర స్థానంలో హైదరాబాద్ ఉందని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలోనే పెద్దసంఖ్యలో యువత,  వేగవంతమైన వృద్ధి రేటు ను సాధించిందని తెలంగాణ చెప్పారు. ఢిల్లీలో గురువారం అమెరికా సంయు క్త రాష్ట్రాలు-, భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్య (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్) సదస్సులో  సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

తెలంగాణలో గత 35 ఏళ్లుగా కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు ప్రభుత్వాలకు సారథ్యం వహించినా పెట్టు బడులకు,పెట్టుబడుదారులకు అందరూ మద్దతు గా నిలిచారని, భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖ ద్వారమని సీఎం తెలిపారు. జీసీసీలకు గ్యమ స్థానంగా ఉన్న హైదరాబాద్‌లో పెట్టుబడులకు ముందుకు రావాలని సీఎం పారిశ్రామి కవేత్తలను ఆహ్వానించారు. మహిళా సాధికారిత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, పట్ట ణాభివృద్ధితో పాటు మెరుగైన వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను నిలుపడమే తన ప్రథమ ప్రాధాన్యత అని సీఎం తెలిపారు. 

30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో భారత్ ప్యూచర్ సిటీ..  

గత 23 నెలల కాలంలో రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. అద్భుతమైన మౌలిక వసతులతో 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ భారతదేశంలోనే నూతన నగరంగా మారుతుందని తెలిపారు.

మూసీ నదీ పునరుజ్జీవనం పూర్తయితే లండన్, టో క్యో, దుబాయి, సియోల్ రివర్‌ఫ్రంట్‌ల మా దిరే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని సీఎం అన్నారు. డ్రై పో ర్ట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు,  ట్రిపుల్ ఆర్  ఓఆర్‌ఆర్ మ ధ్య మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక ఇ న్‌ఫ్రా ప్రాజెక్టుల పురోగతిని సీఎం రేవంత్‌రె డ్డి వివరించారు. చైనా ప్లస్ 1 మోడల్‌కు గ్లోబ ల్ సమాధానం తెలంగాణ అవుతుందన్నారు. 

ప్రపంచస్థాయి విద్యాసంస్థలకు ఆహ్వానం.. 

ప్రపంచస్థాయి విద్యాసంస్థలు హైదరాబాద్‌కు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానిం చారు. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ వంటి ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్ లో ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తే త క్కువ ఖర్చు, సులభమైన వీసా విధానాలతో దక్షిణాది దేశాల (గ్లోబల్ సౌత్) విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. భారతదేశంలో రోడ్లకు ఎక్కువగా నేతల పేర్లు ఉంటా యని, హైదరాబాద్‌లో ఆ ట్రెండ్‌ను మార్చాలని తాము అనుకుంటున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీ పేర్లను పెడతామని సీఎం అన్నారు. సదస్సు ప్రారంభంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను సీఎం ప్రదర్శించారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం ఢిల్లీలో జరిగిన యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరం వార్షిక సమా వేశం లో విశేష ఆదరణ పొందింది. గ్లోబల్ ఇన్వెస్టర్లకు పెట్టుబడుల అవకాశాలు వివరించిన సీఎం ప్రసంగం, అంతర్జాతీయ వ్యాపార వ ర్గాలను ఆకట్టుకుంది.

రేవంత్‌రెడ్డి విజన్ బోల్డ్, క్లియర్, అచీవబుల్ 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ పారదర్శకంగా, సాహసోపేతంగా (బోల్డ్), సాధించగలిగేలా ఉంది. ఆయన చెప్పిన ప్రాజె క్టులు, వాటి సామాజిక ప్రభావం ఎంతో ప్రేరణాత్మకంగా ఉంది.

 జాన్ ఛాంబర్స్, సిస్కో మాజీ సీఈఓ, టెక్ దిగ్గజం 

గ్లోబల్ సమ్మిట్‌కు హాజరవుతాం 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు మా సభ్యులలో అత్యధికులం డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే  తెలంగాణ రైజింగ్  గ్లోబల్ సమ్మిట్‌కు హాజరవుతాం. తెలంగాణ విజన్‌ను దగ్గర గా తెలుసుకోవాలని మేమంతా ఆసక్తిగా ఉన్నాం.

 డా. ముఖేష్ ఆఘి, యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ అధ్యక్షుడు