దూకుడుగా ఆడుతున్న పంజాబ్ ఓపెనర్లు
19-05-2024 04:08 PM
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 17 వ సీజన్ లో భాగంగా ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్- పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ జితేశ్ శర్మ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచులో పంజాబ్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. భువనేశ్వర్ వేసి ఆరో ఓవర్ లో 14 పరుగులు చేశారు. ప్రభ్ సిమ్రన్ సింగ్(39), అథర్వ తైడే(38) పరుగులు చేశారు. ప్రస్తుతం పంజాబ్ 7.3 ఓవర్లకు 80 పరుగులు చేసింది.






