9 May, 2026 | 9:53 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

కుంట్లూరు పెద్దచెరువు కబ్జా

11-12-2024 12:49 AM

అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబర్ 10: నగర శివారులో కబ్జాలపై హైడ్రా దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూ రు గ్రామ పరిధిలోని కుంట్లూరు పెద్దచెరువు కబ్జాకు గురైందనే హైడ్రాకు అందిన ఫిర్యాదుల మేరకు మంగళవారం ఉదయం హైడ్రా తహసీల్దార్ హేమామాలిని, రెవెన్యూ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, ఇరిగేషన్ ఏఈ వంశీగౌడ్ ఆధ్వర్యంలో చెరువుకు సంబంధించి సర్వే ప్రారంభించారు.

సర్వే జరుగుతున్న సమయంలో అధికారులను స్థానికులు కొందరు అడ్డుకున్నారు. ఓ ప్రైవేట్ సర్వేయర్ హైడ్రా అధికారులతో కలిసి సర్వే చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. బుధవారం చెరువు వద్దకు కమిషనర్ రంగానాథ్ వచ్చి పరిశీలించనున్నారు. హైడ్రా ఇన్స్‌స్పెక్టర్ ఆదిత్య, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సర్వేలో పాల్గొన్నారు.