15 April, 2026 | 12:55 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటా

08-04-2025 12:49 AM

బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం

తలకొండపల్లి, ఏప్రిల్ 7: అనారోగ్యంతో మృతి చెందిన పార్టీ కార్యకర్త కుటుంబానికి భరోసా నిస్తు అదైర్యపడొద్దు అండగా ఉంటానని.... కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని  కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బాధిత కుటుంబానికి భరోసానిచ్చారు. కడ్తాల్ మండలం కర్కల్ పహడ్ గ్రామానికి చెందిన కాంగ్రేస్ పార్టీ కార్యకర్త సిలివేరు శ్రీను గత నెల లో అనారోగ్యానీకి గురై మృతిచెందారు.

మృతుని కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంభాన్ని పోషించే వ్యక్తి ఆకాల మృతితో ఆకుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి మృతుని భార్య, పిల్లలు కుటుంబ సభ్యులను సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసానికి పిలిపించుకొని ధైర్యం చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన శ్రీను చిన్న వయస్సులో ఆకాల మృతి చెందడం భాదాకరమన్నారు.

పిల్లలకు మంచి భవిష్యత్ అందించేందుకు, వారి పైచదువులకు తమ వంతు సహా య సహాకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆపద్భందు కింద శ్రీను భార్య, పిల్లలకు రూ.2 లక్షల చెక్కును అర్థిక సహాయంగా ఎమ్మెల్యే శ్రీను కుటుంబ సభ్యులకు అందజేశారు.