31 March, 2026 | 3:35 AM

ప్రజాసమస్యల పరిష్కారానికి ముందుంటా..

31-03-2026 01:14 AM

డాక్టర్ కోట నీలిమ

సికింద్రాబాద్, మార్చి30(విజయక్రాంతి): ప్రజాసమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా ముందుంటానని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కోట నీలిమ అన్నారు. బన్సీలాల్ పేట్ డివిజన్ సీసీ నగర్‌లో ఆమె పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ పాదయాత్ర చేసి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశా రు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరుపై చర్చించారు.

సీనియర్ నేతలు పాండు గౌడ్, నారాయణ, రాజశేఖర్, ఎంపీ సునీల్, కృష్ణ ఆధ్వర్యంలో కొత్తగా రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ పొందిన లబ్ధి దారులను కలిసి వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం పనిచేస్తుందన్నారు. నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.