21-06-2025 02:30:38 AM
కీర్తి సురేశ్ ప్రధా న పాత్రలో నటించిన తాజాచిత్రం ‘ఉప్పుకబ్బురంబు’. ఇందులో సుహాస్ కీలక పాత్ర పోషించారు. సెటైరికల్ కామెడీ డ్రామాగా ఐవీ శశి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రాధికా ఎల్ నిర్మాత. అమెజాన్ ప్రైమ్లో జులై 4 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించగా.. కథానాయిక కీర్తి సురేశ్ మాట్లాడుతూ ఈ చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని తెలిపింది. “ప్రేక్షకులు ఇప్పటివరకూ చాలా డార్క్ కామెడీ సినిమాలు చూసుంటారు. కానీ, ఇది చాలా భిన్నంగా ఉంటుంది. కుటుంబమంతా ఇంట్లో కూర్చొని హాయిగా ఈ సినిమాను చూడొచ్చు.
ఒక సీరియస్ విషయాన్ని ఫన్నీగా చెప్పారు” అని తెలిపిన కీర్తి సురేశ్.. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలిచ్చింది. ‘కథ చెప్పగానే.. ఇలాంటి విషయాన్ని ఎలా తెరపై తీసుకొస్తారు? అనిపించింది. నేను ఇందులో అపూర్వ అనే క్యారెక్టర్లో కనిపిస్తా. నా పాత్ర చాలా మందికి కనెక్ట్ అవుతుంది. చాలా అమాయకంగా ఉండే పాత్ర ఇది.
ఊరి పెద్దగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, పరిస్థితులు అర్థం చేసుకొని సమస్య పరిష్కారం కోసం నా పాత్ర ఏం చేసిందన్నదే ఈ సినిమా కథ. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. ఒకర్ని ఏడిపించటం సులభం. కానీ, నవ్వించడం చాలా కష్టం. ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపుతా. విభిన్న కథానేపథ్యంతో సినిమాలు తీసే దర్శకులతో పనిచేయాలనుకుంటా. విజయ్ దేవరకొండ కోలా కాంబో సినిమాలో నేను నటిస్తున్నానా.. లేదా? అనే విషయాన్ని దిల్ రాజు చెప్తారు” అని తెలిపింది.