15-01-2026 01:37:17 AM
రోహిత్ను వెనక్కి నెట్టిన కోహ్లీ
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
దుబాయ్, జనవరి 14: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నంబర్ వన్ కిరీటా న్ని అందుకున్నాడు. వరుస సెంచరీలు, హాఫ్ సెంచరీలతో సత్తా చాటుతున్న విరా ట్ కోహ్లీ నాలుగేళ్ల తర్వాత ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్లో రో హిత్ శర్మను వెనక్కి నెట్టి కోహ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. గత కొన్ని నెలలుగా కోహ్లీ అద్భుత ఫామ్లో ఉన్నాడు. గత అక్టోబర్లో ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండు సున్నాలకే ఔట్ అయిన కోహ్లీ, ఆ తర్వాత తన ఆటను పూర్తిగా మార్చుకున్నాడు. సిడ్నీలో అజేయంగా చేసిన 74 పరుగులతో ఫామ్లోకి తిరిగి వచ్చిన కోహ్లీ, దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో వరుస రెండు సెంచరీలతో అదరగొట్టాడు.
తాజాగా వడోదరలో న్యూజిలాం డ్తో జరిగిన తొలి వన్డేలో 93 పరుగుల ఇన్నింగ్స్తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతోనే కోహ్లీ మళ్లీ ర్యాం కింగ్స్లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం టాప్లో ఉన్న కోహ్లీ, డారిల్ మిచెల్, రోహిత్ శర్మ ముగ్గురి మధ్య 10 రేటింగ్ పాయింట్ల తేడా మాత్రమే ఉండటంతో అగ్రస్థానం కోసం పోటీ మరింత ఉత్కంఠంగా మారింది. ఇతర భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ ఒక స్థానం ఎగబాకి 11వ స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ ఓపెనర్ డెవన్ కాన్వే మూడు స్థానాలు మె రుగుపర్చుకుని 29వ స్థానానికి చేరాడు. బౌలర్ల ర్యాంకింగ్స్లో మొహమ్మద్ సిరాజ్ ఐదు స్థానాలు ఎగబాకి 15వ స్థానంలో నిలిచాడు. కివీస్ పేసర్ కైల్ జేమీసన్ 27 స్థానాలు మెరుగుపర్చుకుని 69వ స్థానానికి చేరాడు.