24 June, 2026 | 1:00 PM

Breaking News

హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •   ఆశీర్వాద సభ సన్నాహక సమావేశం   •   నేషనల్ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఉప్పరపల్లిలో ఆస్తి వివాదం.. కన్న తండ్రిపై కుమారుడు దాడి   •   బీజేపీ కుట్ర చేసే ప్రమాదం.. SIR ప్రక్రియలో బీఎల్ఏలే కీలకం   •   కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..! 10 రోజులే సమయం   •   గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు పరిపాలన అనుమతి   •   తాగునీటి పైప్‌లైన్ లీకేజీతో ప్రమాదంలో ప్రజారోగ్యం   •  

తంజీమ్‌కు ఐసీసీ షాక్

20-06-2024 01:18 AM

దుబాయ్: బంగ్లాదేశ్ బౌలర్ తంజీమ్ హసన్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. టీ20 ప్రపంచకప్‌లో నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్‌తో తంజీమ్ హసన్ దురుసుగా ప్రవర్తించాడు. అతడి ప్రవర్తనపై సీరియస్ అయిన ఐసీసీ తంజీమ్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది. మ్యాచ్‌లో మూడో ఓవర్ ముగిసిన అనంతరం రోహిత్ దగ్గరకు వెళ్లిన తంజీమ్ కావాలని అతడిని ఢీకొట్టి అనంతరం కవ్వించే మాటలతో దురుసుగా ప్రవర్తించాడు. నిబంధనలను ఉల్లఘించినందుకు గానూ తంజీమ్ మ్యాచ్ ఫీజులో కోత విధిస్తున్నట్లు రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ప్రకటించాడు. ‘ఐసీసీ నిబంధన  ఆర్టికల్ 2.12 ప్రకారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ప్లేయర్.. సహచర ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, అంపైర్లు, మ్యాచ్ రిఫరీతో దురుసుగా ప్రవర్తిస్తే జరిమానా తప్పదు’ అని ఐసీసీ ప్రతినిధి తెలిపారు.