సేంద్రియ వ్యవసాయంతో లాభాలు
భీమిని,(విజయక్రాంతి): సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు వస్తాయని భీమిని మండల వ్యవసాయాధికారి రజిత అన్నారు. మండలంలోని కర్జీ బీంపూర్ గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయంపై మంగళవారం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏవో రజిత మాట్లాడుతూ... సేంద్రియ వ్యవసాయం గోమాత ఆధారంగా చేయడం ద్వారా బూసారం పెరిగి రసాయన ఎరువులు వాడకుండా ఖర్చులు తగ్గించుకోవడంతో రైతులు అధిక లాభం పొందచ్చని అన్నారు.
సేంద్రియ వ్యవసాయంలో జీవామృతం, ఆవు పేడ, గోమూత్రం, ఘనజీవామృతం, ఉపయోగించడం వలన భూసారం పెరిగి పంట దిగుబడి పొందవచ్చునన్నారు. ఇందులో భాగంగా జీవామృతం తయారు చేసే విధానం గురించి రైతులకు వివరించారు. సేంద్రియ వ్యవసాయంతో చేసిన ఆ పంటలు ఆహారంగా తినడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని అన్నారు. గ్రామంలోని పెసర వేసిన రైతు పొలం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులకి సేంద్రియ వ్యవసాయం వైపు మరలాల్సిందిగా కోరారు. అలాగే పంట మార్పిడి చేయవలసిందిగా రైతులకి తెలియజేశారు .ఈ కార్యక్రమంలో కర్జి బీంపూర్ సర్పంచ్ చంద్రకళ దేవి, Aeo శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు.






