ఐసీసీకి కొత్త మహిళా డైరెక్టర్!
23-08-2024 12:00 AM
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ) కొత్త మహిళా స్వతంత్య్ర డైరెక్టర్ కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టులో పెప్సికో హెడ్ ఇంద్రనూయీ ఉన్నారు. ఆరు సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఇంద్రనూయీ పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. అంతే కాకుండా వరల్డ్ బాడీకి కూడా త్వరలో కొత్త చైర్మన్ రానున్నారు. బీసీసీఐ సెక్రటరీ జైషా చైర్మన్ అవుతారని వార్తలు వస్తున్నాయి. ఇంద్రనూయీ 2018లో ఐసీసీ మొదటి మహిళా స్వతంత్య్ర డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఈ పదవి బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. నూయీ లాంటి పవర్ఫుల్ మహిళ కోసం ఇప్పటికే ఐసీసీ వెతుకుతున్నట్లు సమాచారం.






