బంగ్లా బోర్డుకు కొత్త అధ్యక్షుడు
23-08-2024 12:00 AM
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్, చీఫ్ సెలెక్టర్ ఫరూఖ్ అహ్మద్ ఎన్నికయ్యారు. ఇన్ని రోజులు అధ్యక్షుడిగా వ్యవహరించిన హసన్ స్థానంలో 58 సంవత్సరాల అహ్మద్ ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు నజ్ముల్ ప్రస్తుతం లండన్లో ఉన్నాడు. నజ్ముల్ అధికారం కోల్పోయిన అవామీ లీగ్ ఎంపీగా 2009 నుంచి కొనసాగుతున్నారు. ‘గతంలో విధానాలు నచ్చక సెలెక్టర్గా రాజీనామా చేశా. కానీ ప్రస్తుతం పనులన్నీ సాఫీగా సాగే వ్యవస్థను ఏర్పాటు చేస్తా’ అని కొత్త ప్రెసిడెంట్ మీడియాతో అన్నారు.






