ఐడీబీఐ బ్యాంక్ నికరాభం 44 శాతం వృద్ధి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఐడీబీఐ బ్యాంక్ స్టాండెలోన్ నికరలాభం మార్చి త్రైమాసికంలో భారీగా 44 శాతం వృద్ధిచెంది రూ. 1,628 కోట్లకు చేరింది. బ్యాంక్ నికరవడ్డీ ఆదాయం రూ.12 శాతం ఎగిసి రూ.3,688 కోట్లకు పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో ఐడీబీఐ బ్యాంక్ స్థూల ఎన్పీఏలు 6.38 శాతం నుంచి 4.53 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏలు 0.92 శాతం నుంచి 0.32 శాతానికి దిగివచ్చాయి. 2024 మార్చి 31నాటికి ప్రొవిజన్ కవరేజ్ రేషియో (పీసీఆర్) 99.09 శాతానికి చేరినట్లు బ్యాంక్ తెలిపింది. మొత్తం డిపాజిట్లు రూ.2,77,657 కోట్లకు పెరిగాయని, కాసా డిపాజిట్లు రూ.1,40,027 కోట్లకు పెరిగాయని, కాసా రేషియో 50.43 శాతం ఉన్నదని బ్యాంక్ వివరించింది. బ్యాంక్ నికర అడ్వాన్సులు 16 శాతం వృద్ధితో రూ.1,88,621 కోట్లకు పెరిగాయి. అయితే డిపాజిట్లపై వ్యయం 3.71 శాతం నుంచి 4.48 శాతానికి పెరిగింది. షేర్హోల్డర్లకు షేరుకు రూ.1.50 చొప్పున డివిడెండును బ్యాంక్ ప్రకటించింది. ఏజీఎంలో షేర్హోల్డర్ల అనుమతి తర్వాత డివిడెండును చెల్లిస్తారు.






