02-06-2025 12:14:17 AM
నిర్మల్ జూన్ 1 (విజయక్రాంతి) : వాన కాలానికి సిద్ధమవుతున్న రైతులకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వం అమ లు చేసిన రెండు లక్షల రుణమాఫీ అందరికీ అందకపోవడం రైతు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం భరోసా నిధులను ఇవ్వకపోవడంతో జిల్లాలో రైతులు వానకాలానికి పెట్టుబడి లేక అప్పుల పాలవుతున్నారు.
నిర్మల్ జిల్లాలో వాన కాలం సీజన్లో 4,70 లక్షల ఎకరాలు వివిధ పంటలు సాగు చేస్తున్న గా ఇందులో ప్రధానంగా పత్తి 2. 50 సోయా 1.20. వరి1. 40 లక్షల ఎకరాలు సాగు చేస్తున్న మిగతాది జొన్న మొక్కజొన్న పప్పు తెసుకుంటాను సాగు చేస్తారు. వానాకాలం సీజన్లో పంటలు ప్రభుత్వం పెట్టుబడి భరోసా కింద ఎకరానికి 6000 చెల్లిస్తామని హామీ ఇచ్చిన ఇంతవరకు రబీ సీజన్లో మూడు ఎకరాల లోపే పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రైతు ఖాతాల్లో జమ చేసింది.
జిల్లాలో1. 78 లక్షల ఖాతాలు ఉండగా ఇప్పటివరకు కేవలం 50% ఖాతాల్లో మాత్రమే పెట్టుబడి సాయం పడినట్లు రైతులు తెలిపారు. పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా అప్పటి ప్రభుత్వం 228 కోట్లు జిల్లాకు విడుదల చేసేది. ఇప్పటివరకు జిల్లాలో యాసం గికి సంబంధించిన పెట్టుబడి సాయం కేవలం 65 వేల మంది రైతులకు అందినట్టు అధికారులు తెలిపారు.
నాలుగు ఎకరాలకు పైగా సాగు భూమిని రైతులకు ఇప్పటికీ పెట్టుబడి సాయం అందకపోవడంతో ప్రభుత్వం వైపు చూస్తున్నారు. జూన్ మోసం ప్రారంభమైన ప్రభుత్వం మిగిలిపోయిన వారికి రుణమాఫీ రైతు పెట్టుబడి సాయం రైతు భరోసా నిధులపై ఇప్పటికి స్పష్టత ఇవ్వకపోవడంతో పెట్టుబడికి పైసలు లేక రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు.
బ్యాంకులు ప్రతి సంవత్సరం మే జూన్ మాసంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లిస్తేనే రైతులకు వడ్డీ రైతు పథకం వర్తిస్తుంది. చేతిలో పైసలు లేకపోవడం వరి జొన్నలు అమ్మిన డబ్బులు చేతికి రాకపోవడంతో బ్యాంకు రుణాలు చెల్లించలేక వడ్డీ రాయితికి రైతులు దూరమవుతున్నారు. వడ్లు విక్రయించిన రైతులకు ప్రభుత్వ సముద్రమకకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
పెట్టుబడులపై రైతుల వేట
నిర్మల్ జిల్లాలో రైతులకు రుణమాఫీ కాకపోవడం. ప్రభుత్వం పెట్టు బడి సాయం అందకపోవడంతో జిల్లా రైతులు పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికి ముందస్తు వర్షాలు కురవడంతో భూములు చదును చేసుకున్న రైతులు కావలసిన విత్తనాలు ఎరువులు కొనుగోలు చేస్తున్నారు.
వేసవి దూకులు దున్ను కొనడానికి ట్రాక్టర్లు యంత్రాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని చాలా గ్రామాల రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం పెట్టుబడి భరోసా నిధులతో పాటు రెండు లక్షలు పైన ఉన్న రైతులకు రుణమాఫీ పథకాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటే జిల్లాలో మెజార్టీ రైతులకు ప్రయోజనం చేకూర్స్తుంది.
ఇప్పటికైనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని రైతులకు చేయూత అందించి వానాకాలం వ్యవసాయ సీజర్ కు అండగా ఉండాలని అండగా ఉండాలని జిల్లా రైతులు కోరుతున్నారు. ఒకవైపు రాజు యువ వికాసం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం వానాకాలం సీజన్లో రైతులకు ఏమాత్రం ఉపయోగపడని విధంగా వివరించడంపై జిల్లా రైతులు మండిపడుతున్నారు.