02-06-2025 12:12:22 AM
వ్యాయామ ఉపాధ్యాయుడు రవికుమార్ మృతితో పూర్వ విద్యార్థుల్లో అలుముకున్న విషాదఛాయలు
ముషీరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): ఆత్మీయ సమ్మేళనంలో సంతాప సభ గా మారింది. హైదరాబాద్ దోమలగూడలోని ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల (1991) పూర్వ విద్యార్థుల సమ్మేళనం దోమలగూడ ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాలలో ఆదివారం జరిగింది. ఈ సమ్మేళనానికి విచ్చేస్తున్న కరీంనగర్ జిల్లా పెద్దపల్లి కి చెందిన వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడు కటారి రవికుమార్ (57) సిద్దిపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
ఈ సమ్మేళనానికి ఆంధ్ర. తెలంగాణ నుంచి 70 మంది పైగా వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సమావేశాన్ని రవికుమార్ సంతాప సభగా మారింది. తమతో చదువుకున్న పూర్వ విద్యార్థి రవికుమార్ అకాల మృతి పట్ల వారు తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. దాదాపు 34 సంవత్సరాల తర్వాత ఆయన స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా రవికుమార్ వ్యవహరిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా వాయమ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా జిల్లా క్రీడల సమాఖ్య నిర్వహణ కార్యదర్శిగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. రవికుమార్ అకాల మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ కోశాధికారి, ఓయూ ప్రొఫెసర్ రాజేష్ కుమార్, తెలంగాణ జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బి. లక్ష్మయ్య, రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సోమన్న, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎ. బాలరాజ్, ఉపాధ్యక్షులు డాక్టర్ జగన్మోహన్ సిద్ధ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఒక ప్రకటనలో తెలియజేశారు.