6 May, 2026 | 10:34 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం ఉదృతం చేస్తాం

04-12-2025 12:00 AM

చలో హైదరాబాద్ కు రంగారెడ్డి జిల్లా నుండి భారీగా తరలిన జర్నలిస్టులు

శంకర్ పల్లి, డిసెంబర్ 3 (విజయక్రాంతి): వర్కింగ్ జర్నలిస్టుల ప్రధాన సమస్యలు పరిష్కరించే వరకు ప్రజాస్వామ్యం యుతంగా తమ నిరసనలను ప్రభుత్వం దిగివచ్చే కొన సాగిస్తామని రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎండి సలీం పాషా,  కార్యదర్శిసత్యనారాయణలు అన్నారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ టియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన మహాధర్నా గ్రాండ్ సక్సెస్ అయిందని అన్నారు.జిల్లా వ్యాప్తంగా వందలాది మంది జర్నలిస్టులు ధర్నా కు హాజరయ్యారు.రంగారెడ్డి జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలివచ్చి ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని  వారు డిమాండ్ చేశారు.

ధర్నాకు  శేరిలింగంపల్లి, చేవెళ్ల, షాద్ నగర్, ఎల్బీనగర్ మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి  నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నూతన జర్నలిస్టులకు అక్రీడేషన్లు, హెల్త్ కార్డులు,ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, వృత్తి కమిటీలు నియమించాలని, చిన్న, మధ్యతరగతి పత్రికలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.