రైల్వే ప్రాజెక్ట్ తరలిస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా
మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రకటన
మహబూబాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాకు మంజూరు చేసిన మెగాప్రైట్ మెయింటెనెన్స్ డిపో మహబూబాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని, ఇతర సాకులతో ప్రాజెక్టు ఇతర ప్రాంతానికి తరలిస్తే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా తాను సిద్ధమని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ప్రకటించారు.
మానుకోటలో మెగాప్రైట్ రైల్వే డిపోను ఏర్పాటు చేయడానికి చేస్తున్న ఉద్యమానికి బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే మెగా ప్రాజెక్టు మహబూబాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని, ఇంత పెద్ద ప్రాజెక్టు ఇతర ప్రాంతాలకు తరలించే కుట్ర జరుగుతుంటే ప్రస్తుత ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు.






