16 May, 2026 | 2:14 PM

అక్రమ పశు రవాణాను అడ్డుకోవాలి

16-05-2026 01:28 PM

ములుగు (విజయక్రాంతి): పశువుల అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని, పశువుల అక్రమ రవాణాను అప్రమత్తంగా ఉంటూ అడ్డుకోవాలని పోలీసు అధికారులను ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ ఆదేశించారు. శనివారం జిల్లా పరిధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మల్లంపల్లి, పస్రా పోలీస్ చెక్పోస్టులను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వాహనాల వివరాలను రిజిస్టర్లలో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. పశువుల రవాణా చేసే వాహనాలను, పశువుల రవాణాకు సంబంధించిన పత్రాలను పరిశీలించాలని, అక్రమ రవాణా జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. షిఫ్టుల వారిగా విధుల్లో పాల్గొనాలని, చెక్ పోస్ట్ వద్ద తనిఖీ అధికారులు, సిబ్బందికి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఎస్పీ వెంట ములుగు డిఎస్పి రవీందర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శంకర్, పసర, ములుగు సిఐలు దయాకర్, సురేష్, పసర ఎస్ ఐ తాజుద్దీన్ పాల్గొన్నారు.