calender_icon.png 13 August, 2025 | 11:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యతోనే నిరక్షరాస్యతను అంతం చేయాలి

11-08-2025 12:13:30 AM

-చెట్లను, అడవులను రక్షించాలి.

- మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

ములుగు, తాడ్వాయి ఆగస్టు10 (విజయక్రాంతి): విద్య ద్వారా నిరక్షరాస్యతను అంతం చేయాలని,విద్యార్థులకు విద్య అందించడం ద్వారా వారి జీవితాలలో వెలుగులు నింపవచ్చని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు ఆదివారం తాడ్వాయి మండలం మండల తోగు లో నూతనంగా నిర్మించిన పాఠశాలను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షే మ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్, జి గ్రంథా లయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణిలతో ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గుత్తికోయ  గూడాలలో చిన్నారులకు విద్య అందించాలని ప్రభుత్వ పాఠశాలలు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఆలోచిస్తుందని, ఈ ప్రాం తం అభయ అరణ్యంలో ఉండడం ద్వారా అనుమతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ తరుణంలోనే ఈ ప్రాంతం లోని పిల్లలకు విద్యను అందించాలనే సంకల్పంతో  పీపుల్ హెల్పింగ్ సెంటర్ ఎన్ జిఓ సంతోష్ 2020 కరోనా నుంచి ఈ ప్రాం తంలో మాతో కలిసి తమ సేవలను అందిస్తున్నాడని, చక్రవర్తి హాస్పిటల్ యాజ మాన్యం గతం సంవత్సరం లో తక్కలపాడు లో స్కూల్ నిర్మించారని, ఈ రోజు ఇక్కడ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, సహకరించడం చాలా అభినందనీయమని పేర్కొన్నారు. విద్య అందరి ప్రాథమిక హక్కు అని, గిరిజన ప్రాంతాలలో  స్వచ్ఛంద సంస్థ  ఆధ్వర్యంలో మౌలిక వసతులు కల్పిస్తూ, విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి, కలెక్టర్ భోజనం చేశారు.