రాష్ట్రంలో భారీ వరదల ప్రభావం.. బీజేపీ సభ్యత్వ నమోదు వాయిదా
మాజీ ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): సెప్టెంబర్ 3న తెలంగాణలో నిర్వహించాల్సిన బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారం భోత్సవ కార్యక్రమం వాయిదా పడినట్లు మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు తెలిపారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రాష్ర్ట కార్యాలయంలో అధ్యక్షులు కిషన్ రెడ్డి నేతృత్వంలో కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా, భారీ వర్షాల నేపథ్యంలో అధిష్టానం సూచన మేరకు వాయిదా వేస్తున్నట్లు నిర్ణయించామన్నారు.
భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పీఎం నరేంద్ర మోదీ, కేం ద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లామ న్నారు. వరద బాధితులకు బీజే పీ నాయకులు, కార్యకర్తలు సహాయం అందించాల ని, సహాయక చర్యల్లో పాల్గొనాలని ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, అమిత్ షా పిలుపునిచ్చారని తెలిపారు.






