02-06-2025 02:32:32 AM
హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): రా ష్ర్టంలోని అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్బుకింగ్ విధానం తోపాటు కృత్రిమమేథ(ఏఐ) సేవలను ఉపయోగించుకొని ప్రజల కు మరింత సులువైన సమర్థవంతమైన సేవలను అందించబోతున్నామని రాష్ర్ట రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
రాష్ర్టవ్యాప్తంగా 144 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు గాను ఇప్పటివరకు ప్రయోగాత్మకం గా రెండు విడతల్లో 47 చోట్ల స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలుచేయగా తాజాగా జూన్ 2వ తేదీ నుంచి మిగిలిన 97 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలుచేస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం స్టాంప్స్, రిజిస్ట్రేషన్ అధికా రులతో మంత్రి సమీక్ష జరిపారు.
ఆస్తుల క్రయవిక్రయదారులకు సమయం ఆదా అయ్యేలా పారదర్శకంగా అవినీతిరహితంగా మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టిన స్లాట్బుకింగ్ విధానం వల్ల తాము అనుకున్న విధంగానే సత్ఫలితాలు వచ్చాయని, 94 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని అ న్నారు.
మొదటిదశలో 22 సబ్రిజిస్ట్రార్ కా ర్యాలయాల్లో ఏప్రిల్ 10నుంచి ఇప్పటివరకు 30,592డాక్యుమెంట్లు, రెండోదశలో 25 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మే 12నుంచి ఇప్పటివరకు 14,099 డాక్యుమెంట్లు మొత్తం 45,191డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగాయని, స్లాట్బుకింగ్ వల్ల మూడువేల డాక్యుమెంట్లు ఎక్కువగా రిజిస్ట్రేషన్ జరిగాయని తెలిపారు.
సందేహాల నివృత్తికి ఏఐ చాట్బాట్ వాట్సాప్ నెంబర్
అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానంతో పాటు కృత్రిమ మేధ(ఏఐ) అనుసంధానంతో కూడిన చాట్బాట్- మేధ 82476 23578 వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఈ నూతన ప్రక్రియ వల్ల రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి కలిగే సందేహాలు నివృత్తి అవుతాయని అంతేగాకుండా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లొకేషన్, స్లాట్ బు కింగ్ ఖాళీల వివరాలు, సమయం అందుబా టు వంటి సమాచారం లభిస్తుందన్నారు. గిఫ్ట్డీడ్, సేల్డీడ్పై రిజిస్ట్రేషన్ చార్జీలు మార్కెట్ ధరలు తదితర అన్ని అంశాలపై ఈ ఏఐ చాట్బాట్ -మేధ ద్వారా సమాచారం తెలుసుకోవ చ్చన్నారు.
డబుల్ రిజిస్ట్రేషన్లు జరగకుండా..
అక్రమాలకు చెక్పెట్టేలా లేఅవుట్లలో డబుల్ రిజిస్ట్రేషన్ జరగకుండా, రిజిస్ట్రేషన్ పూర్తయిన వాటి వివరాలు, పూర్తి కాని వాటి వివరాలు ఇటు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అటు బిల్డర్ లేదా డెవలపర్ దగ్గర వివరాలు ఉండేలా డెవలపర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ను త్వరలో తీసుకువస్తామని మంత్రి తెలిపారు.
ఈ మ్యాడుల్లో రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ల వివరాలు రెడ్కలర్లో కనిపిస్తాయిని తెలిపారు. స్లాట్ బుకింగ్ విధానం దృష్ట్యా సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పని భారం అధికంగా ఉన్న పఠాన్చెరు, యాదగిరిగుట్ట, గండిపేట, ఇబ్రహీంపట్నం, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాలలో అదనపు సబ్రిజిస్ట్రార్తోపాటు సిబ్బందిని నియమించామని మంత్రి పొంగులేటి తెలిపారు.
ప్రతి ఎస్ఆర్వోలో రోజుకు 48 స్లాట్స్
ఉదయం 10.30 గంటల నుంచి లంచ్ సమయాన్ని మినహాయించి సాయంత్రం 5 గంటల వరకూ స్లాట్ బుక్ చేసుకోవచ్చునని ప్రతీ కార్యాలయంలో రోజుకు 48స్లాట్లు బుక్ అవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. స్లాట్బుకింగ్ చేసుకోని వారి కోసం ఏదైనా అత్యవసర సందర్భాల్లో సాయంత్రం 5 నుంచి 5.30గంటల వరకు ఐదు వాకిన్ రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తున్నామన్నారు.
రాష్ర్టవ్యాప్తంగా స్లాట్ బుకింగ్ తీసుకువస్తున్న నేపథ్యంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్త లు తీసుకోవాలని సూచించారు. స్లాట్ బుకింగ్తోపాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంలో భాగంగా ఆధార్ -ఈ సంతకం ప్రవేశపెడుతున్నామని ముందుగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఖమ్మం జిల్లా కూసుమంచి సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని త్వరలో రాష్ర్టవ్యాప్తంగా తీసుకొస్తామన్నారు.