12 March, 2026 | 11:42 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

అర్జీలు సకాలంలో పరిష్కరించాలి

19-01-2026 09:15 PM

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

109 దరఖాస్తుల రాక

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ప్రజావాణి అర్జీలు సకాలంలో పరిష్కరించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సిరిసిల్ల సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. మొత్తం దరఖాస్తులు 109 వచ్చాయి.ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారులకు అందించి, నిర్ణిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.

పరిహారం చెక్కు అందించిన ఇంచార్జి కలెక్టర్

సెర్ప్ లో సీసీ గా విధులు నిర్వర్తిస్తూ మరణించిన ఉద్యోగి కుటుంబానికి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిహారం చెక్కును అందజేశారు. ఇల్లంతకుంట మండలంలో సెర్ప్ లో సీసీ సదయ్య మరణించగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇంచార్జి కలెక్టర్  స్త్రీనిధి ద్వారా రూ. లక్ష 50 వేల  పరిహారం చెక్కును సదయ్య భార్య మంద సరళ కు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేశారు.కార్యక్రమంలో గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, డీఆర్డీఓ గీత, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్, స్త్రీనిధి ఆర్ఎం భూ కైలాస్ తదితరులు పాల్గొన్నారు.