14-01-2026 12:37:43 AM
నేడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు
హనుమకొండ టౌన్ జనవరి 13 (విజయక్రాంతి): కాజీపేట రైల్వే స్టేడియంలో జ రుగుతున్న 58వ జాతీయ సీనియర్ నేషనల్ ఖో ఖో పోటీలు మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో మహిళల డిఫెండింగ్ ఛాంపియన్ మహారాష్ట్ర 44-10 స్కోర్ తేడాతో ఉత్తరప్రదేశ్ పై, పురుషుల డిఫెండింగ్ ఛాం పియన్ రైల్వేస్ 39 -12 స్కోర్ తేడాతో పుదుచ్చేరిపై గెలిచి ప్రీ క్వార్టర్ ఫైనల్ కు చేరాయి.
మహిళల విభాగంలో కొల్హాపూర్ 23-4 తో హర్యానాపై, గుజరాత్ 26 -21 తో కేరళ పై, కర్ణాటక 27-18 తో పశ్చిమ బెంగాల్ పై, తమిళనాడు 19-12 తో ఆంధ్ర ప్రదేశ్ పై, ఒడిశా 30-18 తో విధర్భపై, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 25-12 తో పంజాబ్ పై ఢిల్లీ 35 -16 తో రాజస్థాన్ పై గెలిచి ప్రీ క్వార్టర్ ఫైనల్ చేరాయి. పురుషుల విభాగంలో కర్ణాటక 24- 19 తో ఆతిథ్య తెలంగాణపై గెలుపొందింది.
తొలి అర్ధ భాగంలో కర్ణాటక 15- 9 స్కోర్ సాధించింది. కర్ణాటక జట్టులోని జి.సునిల్ 2.30 టైమింగ్ ఇవ్వడమే కాకుం డా నాలుగు పాయింట్లు సాధించాడు. తెలంగాణ జట్టులోని టి.నిరీక్షణ్ 2.40, జై కుమార్ 1.40 , జీ దినేష్ 50 సెకండ్స్ ఆడారు.కెప్టెన్ రాకేష్ సైతం 4పాయింట్లు చేజింగ్ లో సాధించాడు. క్వార్టర్ ఫైనల్ లో తెలంగాణ జట్టు ఆంధ్ర ప్రదేశ్ తో తలపడనుంది.
మిగతా లీగ్ మ్యాచ్ లో కేరళ 28- 23 తో ఢిల్లీ పై, పశ్చిమబెంగాల్ 27- 21 తో చత్తీస్ గడ్ పై, ఆంధ్ర ప్రదేశ్ 28 -25తో తమిళనాడుపై, మహారాష్ట్ర 24 -15తో ఉత్తరప్రదేశ్ పై, కొల్హాపూర్ 29 -22 తో గుజరాత్ పై, ఒడిశా 25-11 తో విదర్భపై విజయాలు సాధించి ప్రీ క్వార్టర్ ఫైనల్ కీ చేరాయి. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు బుధవారం ఉదయం నుండి జరగనున్నాయి.
ముగిసిన మహిళల పోరాటం
తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ సీనియర్ ఖోఖోఛాంపియన్షిప్ లో ఆతిథ్య మహిళల జట్టు పోరాటం ముగిసింది. తెలంగాణ జట్టులోని క్రీడాకారుల సమన్వయ లోపం, కీలక దశలో రాణించకపోవడంతో లీగ్ దశలో నిష్క్రమించింది. గ్రూప్ డి విభాగంలో మొత్తం మూడు మ్యాచ్లు ఆడిన తెలంగాణ కేవలం ఒక మ్యాచ్ గెలిచింది. మంగళవారం ఉదయం పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్లో 36-4 స్కోర్ సహా ఇన్నింగ్స్ తేడాతో తెలంగాణ మహిళల జట్టు విజయం సాధించింది. అయితే అంతకుముందు తెలంగాణ, రాజస్థాన్ తో 20-22 స్కోర్ తో కేవలం రెండు పా యింట్లు తేడాతో ఓటమి పొందింది.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో తెలంగాణ 14-21 తేడాతో పరాజయం పాలైంది. మంగళవారం జరిగిన పలు పోటీలను భారత ఖో ఖో సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఉప్కార్ సింగ్, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి నాతి కృష్ణమూర్తి, హనుమకొండ, హైదరాబాద్ జిల్లాల క్రీడల యువజన శాఖ అధికారులు గుగులోతు అశోక్ కుమార్, నడిపెల్లి సుధాకర్ రావు, సీనియర్ ఖో ఖో కోచ్ యతిరాజ్, వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తోట శ్యాం ప్రసాద్ లు ప్రారంభించారు.