14 April, 2026 | 8:53 PM

ఈ వారం వార్తల్లో..

23-11-2025 12:25 AM

తగిలే రాళ్లే పునాది!

‘తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్లని హితులుగా తలచి ముందుకెళ్లాలని’ అన్న ఓ సినీ కవి అన్న మాటలు సరిగ్గా ‘మిస్ యూనివర్స్-2025’ ఫాతిమాకు సరిగ్గా సరిపోతాయి. విశ్వసుందరి కావాలనే తన కల సాధించుకునే దారిలో ఆమె ఎన్నో ఛీత్కారాలు, అవమానాలు, హేళనలను ఎదుర్కొన్నారు. పట్టువదలని విక్రమార్కురాలిగా పోరాడి చివరకు విశ్వ సుందరి టైటిల్ గెలుచుకున్నారు.

మౌన మూగ రోదనిది!

ఎవరైనా ఎన్నికల్లో ఓటమిపాలైతే శంకరగిరి మాన్యాలు పడతారు. లేదంటే వచ్చే ఎన్నికల్లోనైనా గెలిచి తీరుతామని మంగమ్మ శపథం చేస్తారు. ఇంకా.. కాస్త అహమున్న వారైతే రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటారు. కానీ, జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ (పీకే) రూటే సెపరేటు. ఆయన పార్టీ ఎన్నికల్లో ఒక్క సీటైనా సాధించనందుకు నైతిక బాధ్యత వహించి, మౌనవ్రతం తీసుకున్నారు.