24 March, 2026 | 8:01 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

బడుల్లో పెరుగుతున్న బాలికల సంఖ్య

30-07-2024 01:24 AM

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): పాఠశాలస్థాయిలో చదువు తున్న బాలికల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠ శాలల్లో చదువుతున్న బాలికల సంఖ్య పెరుగుతోందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. 2022 విద్యాసంవత్సరంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చేరినవారు మొత్తం 27,85, 741 మంది ఉండగా, 2023 28,46,583 మందికి చేరారు. ఇందులో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 2022 13,99, 876 మంది చేరితే, ఆరు నుంచి ఎనిమిది తరగతుల్లో 8,56,405 మంది, తొమ్మిది, పది తరగతుల్లో 5,29,460 మంది చేరారు. 2023 1 తరగతుల్లో 14,22,743 మంది చేరగా, ఆరు నుంచి ఎనిమిది తరగతుల్లో 8,82,939 మంది, తొమ్మిది, పదో తరగతుల్లో 5,40,901 మంది చేరారు.