09-08-2025 02:57:02 AM
కేంద్ర మంత్రి పీయూష్
న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఇండియా@100 పేర నిర్వహించిన బిజినెస్ మీట్లో శుక్రవా రం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా భారత్పై విధించిన సు ం కాలపై స్పందించారు. భారత్ ఎవరి ఎదుట తలవంచే ప్రసక్తే లేదన్నారు. ‘ప్రస్తుతం భార త ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. బలమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం 6.5 శాతం వార్షికాభివృద్ధితో పరుగులు పెడుతోంది’ అని పేర్కొన్నారు.
యురో పియన్ దేశాలు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం గా ఉన్నాయని.. ఈ పెట్టుబడుల ద్వారా 10 లక్షల మందికి ప్రత్యక్షంగా 50 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. అక్టోబర్ 1 నుంచి ఈ ఎఫ్టీఏ ఒప్పందం అమల్లోకి వస్తుందని.. ప్రయోజనాలు అందుతాయని తెలిపారు.