ఐదో టీ20లోనూ భారత్ విజయం
సిల్హెట్: బంగ్లాదేశ్ గడ్డపై భారత మహిళల జట్టు అదరగొట్టింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను మన అమ్మాయిలు క్లీన్స్వీప్ చేశారు. గురువారం జరిగిన ఆఖరి పోరులో భారత్ 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తుచేసింది. బ్యాటింగ్లో మంధన, హేమలతా, రిచా ఘోష్ మెరుపులకు తోడు రాధా యాదవ్ తన స్పిన్ అస్త్రంతో మెరవడంతో బంగ్లాపై సునాయాస విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
హేమలత (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), స్మృతి మంధన (25 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్సర్), హర్మన్ప్రీత్ (24 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించగా.. ఆఖర్లో రిచా ఘోష్ (17 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్) ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. బంగ్లా బౌలర్లలో రాబియా, నహిదా అక్తర్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 157 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులకు పరిమితమైంది. రీతు మోనీ (37) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో రాధా యాదవ్ 3 వికెట్లు తీయగా, ఆశా 2, టిటాస్ సాధు ఒక వికెట్ పడగొట్టారు. సిరీస్లో విశేషంగా రాణించిన రాధా యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు కైవసం చేసుకుంది.