9 April, 2026 | 3:01 PM

భారత్‌కు ఐదు గోల్డ్ మెడల్స్

10-02-2026 01:03 AM

సౌత్ ఏషియా సెపక్ తక్రా చాంపియన్‌షిప్‌లో ఘనత

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): కొలంబోలో జరిగిన సౌత్ ఏషియా సెపక్ తక్రా చాంపియన్‌షిప్‌లో భారత మహిళలు, పురుషుల జట్లు చరిత్ర సృష్టించా యి. ఐదు బంగారు పతకాలు సాధించి అద్భుత విజయాలను నమోదు చేశాయి. సెపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ పెరిక సురేష్  వివరాలను వెల్లడించారు. సెపక్ తక్రా మేనేజ్మెంట్ కమి టీ నాయకత్వంలో ఈ లెగ్ వాలీబాల్ వేగం గా ప్రాచూర్యం పొందుతోందని అన్నారు.

ప్రధాని మోదీ  ’ఖేలో ఇండియా ఖేలో’ ఉద్య మ స్ఫూర్తిని సాకారం చేస్తూ భారత ఆటగాళ్లు చారిత్రక విజయం సాధించారని పేర్కొ న్నారు. ఇటీవల టోక్యోలో జరిగిన 2026 ఏషియన్ గేమ్స్ టెస్ట్ ఈవెంట్లోనూ భారత పురుషుల సెపక్ తక్రా జట్టు గోల్డ్ మెడల్  సాధించి దేశానికి గౌరవం తెచ్చింది. ఈ విజయంపై సౌత్ ఏషియా సెపక్ తక్రా ఆర్గనైజే షన్ అధ్యక్షుడు ఎస్.ఆర్. ప్రేమ్ రాజ్, సెపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు శ్రీనివాసులు, ఉమ్మడి కార్యదర్శి పెరిక సురేష్, జనరల్ సెక్రటరీ నరేష్ కుమార్ లు ఆటగాళ్లు, కోచ్లు, మేనేజ్మెంట్, ఫెడరేషన్ సభ్యులకు  అభినందనలు తెలిపారు.