23 August, 2026 | 6:57 PM

Breaking News

వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నికాసైన కమ్యూనిస్టు నాయకుడికి కడసారి కన్నీటి వీడ్కోలు   •   బాన్సువాడలో ప్లాస్టిక్‌ నిషేధం అమలయ్యేనా...? యథేచ్ఛగా వినియోగం   •   గురుస్వామి బోనకుర్తి అర్జున్‎కి ప్రత్యేక గురు పురస్కారం   •   తండాలకు రోడ్డు మోక్షం ఎప్పుడు..!   •   రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘం అభివృద్ధికి కృషి   •   బీర్కూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా బోయిని శంకర్   •   లక్ష్మిపూర్‎లో చోరీ రూ. 3లక్షలు విలువైన వస్తువుల అపహరణ   •   మిత్రుడి వైద్య చికిత్సకు మల్లంపేట్ పెద్దల ఆర్థిక సహాయం   •   నడిరోడ్డుపై గుంత ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు   •  

ఒప్పంద రద్దును పునఃసమీక్షించండి!

15-05-2025 12:04 AM
  1. సింధూ జలాలపై లేఖ రాసిన దాయాది
  2. సింధూ జలాలు నిలిపేస్తే పాక్‌లో పరిస్థితి దారుణంగా ఉంటుందని లేఖ

న్యూఢిల్లీ, మే 14: ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో కుదిరిన సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ రద్దు చేసింది. ఒప్పందం రద్దు తర్వాత తీవ్ర స్వరంతో హెచ్చరికలు చేసిన పాక్ యంత్రాంగం ఇప్పుడు రద్దును పునఃసమీక్షించమని కోరుతూ భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్టు తెలుస్తోంది.

పాకిస్థాన్ జలవనరుల శాఖ భారత జల మంత్రిత్వ శాఖకు ఈ మేరకు లేఖ రాసినట్టు సమాచారం. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసినట్టు విదేశాంగ శాఖ పాకిస్థాన్ జలవనరుల శాఖకు లేఖ ద్వారా తెలియజేసింది. ఈ ఒప్పందం ద్వారా సట్లెజ్, బియాస్, రావి నదుల నీటిని భారత్, సింధూ, జీలం, చినాబ్ నదుల నీళ్లను పాక్ ఉపయోగించుకుంటున్నాయి. ఈ అన్నీ నదులు కూడా భారత భూభాగం నుంచే ప్రవహిస్తున్నాయి.