25-07-2025 12:25:08 PM
సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్
మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామం లొ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు శుక్రవారం ఎంపీడీవో రాణి హౌసింగ్ ఏ ఈ గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటరామిరెడ్డి కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ(Indiramma houses) ఇండ్ల నిర్మాణనికి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ... అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల లబ్ది చేకూర్చేందుకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు కృషిచేస్తున్నారన్నారు.ఇండ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు లబ్దిదారుల అకౌంట్లలో జమచేస్తుందని అన్నారు. నిరుపేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి.. వారి కళా సహకారం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాణి హౌసింగ్ ఏఈ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ ముగ్డే వార్ సంగ్రామ్ పటేల్ మాజీ ఎంపిటిసి శంకర్ పటేల్ అశోక్ అప్ప వెంకటరావు పటేల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటరమరెడ్డి తులసి రామ్ లబ్ధిదారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.